అందాల భామ సమంతను నమ్మినోళ్లే మోసం చేశారట.. తాను మంచి వారు అని నమ్మిన వాళ్లే మోసం చేయటంతో.. సమంత కూడా ఆ మోసాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇంతకి సమంత ఎవరి చేతిలో మోసపోయింది? ఆ కథ ఏంటో చూద్దాం. ప్రతి హీరోయిన్ కు ఓ టీం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నెపథ్యంలో సమంత టీం లో కూడా ఐదుగురు ఉన్నారు. వీరిలో కొందరూ ముంబై బ్యాచ్ ఉన్నారట. వీళ్లందరిని సమంత ఇటివలే మార్చేసిందట. అయితే రీసెంట్ గా సమంత డైమండ్ రింగ్ పోయింది.
ఆ రింగ్ ఎప్పుడూ సమంత చేతికే ఉంటుంది. అయితే షూటింగ్ వెళ్లేటప్పుడు కార్ వ్యాన్లో ఆ రింగ్ ఉంచి.. షూటింగ్ ఆయిపోయాక మళ్లీ ఆ రింగ్ వేలికి తొడుగుతుంది. అలాంటి రింగ్ ఓ రోజు సడెన్గా కనిపించకుండా పోయిందట. దానిని తన టీంలోనే ఎవరో ఒకరు కాజేసి ఉంటారన్నది సమంత నమ్మకం. సమంత తన టీం మెంబర్స్ను చాలా బాగా చూసుకుంటుందట.
షూటింగ్లో ఉన్నన్ని రోజులు నిర్మాతలకు బేటాలు ఇప్పించడం దగ్గర నుంచి, తాను అదనంగా వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం, జీతాల విషయంలో లోటు లేకుండా ఉండడం చేస్తుండేదట. తాను ఎంత బాగా చూసుకున్నా వారు ఆమెను మోసం చేయడంతో సహించలేకపోయిందట. సమంత ఎప్పుడు షాపింగ్ చేసినా, తన టీమ్కీ ఏదోటి కొని తీసుకొచ్చేదట. ఇంత బాగా చూసుకొంటే.. రింగ్ దొంగలించడం ఏమిటి? అందుకే సమంత చాలా బాధపడిందట. అందుకే వీరందరిని ఉద్యోగాల నుంచి పీకేసిందట. ఒక్క డ్రైవర్ని మినహా మిగిలిన వాళ్లనందరికీ తొలగించిందని తెలుస్తోంది. రింగ్ పోయిన బాధకంటే నమ్మినోళ్లు మోసం చేశారన్న బాధే ఎక్కువుగా ఉందట.
Related