Tuesday, April 30, 2024
- Advertisement -

లఖ్​నవూ సమీపంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎక్స్​ప్రెస్

- Advertisement -

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. అమృత్​సర్​ నుంచి జైనగర్​ వెళ్తున్న షహీద్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రెండు బోగీలు రైలు నుంచి విడిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు బోగీల్లో మొత్తం 155మంది ప్రయాణికులున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు చార్​బాగ్ రైల్వే స్టేషన్​ నుంచి రైలు బయలు దేరిన తర్వాత ప్రమాదం జరిగినట్లు సీనియర్​ డివిజినల్​ కమర్షియల్​ మేనేజర్​ జగ్తోష్​ శుక్లా తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులు భయంతో అరుపులు, కేకలు పెట్టారని రైల్వే వర్గాలు తెలిపాయి. అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని నియంత్రించినట్లు పేర్కొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -