సుక్క పడితే చాలు ఎంతటి వారైనా సరే.. మాటల ప్రవాహాన్ని మొదలుపెడతారు.. ఇక వాళ్లను చూసే జనాలకు ఆశ్చర్యమొక్కటి తక్కువ. మరికొందరైతే మందు సుక్క గొంతుల పడంగనే ఏకంగా డ్యాన్సులు.. చిత్ర విచిత్ర మాటలను సైతం పలికించేస్తుంటారు. అందుకే అంటరు పెద్దలు.. తాగి వాగడం కాదు.. తాగకుండా ఉన్నప్పుడు మాట్లాడు ఇవే మాటలని..
ఇదంతా రొటీన్ విషయమే..కానీ చాలా మంది నాలుగు పెగ్గులు కడుపుల వేయగానే దారలంగా ఇంగ్లీష్ ను మాట్లాడేస్తుంటారు. నార్మల్ గా ఉన్నప్పుడు మాట్లాడరు కానీ.. మందు తాగగానే ఇంగ్లీష్ లో తెగ మాట్లాడేస్తుంటారు. అయితే ఈ విషయంపై ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేశారు. ఈ విషయంపై సైకోఫార్మలజీ జర్నల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెళ్లడించింది.
తాగకముందు మొహమాట పడే జనాలు.. రెండు గ్లాసులు ఆల్కాహాల్ కడుపులో పడగానే.. భయం.. మొహమాటం పటాపంచలై పోతాయట. నాకు సాధ్యం కానిది ఏదీ లేదు అనే నమ్మకం వస్తుందట. మద్యం తాగగానే ధైర్యం పెరిగి.. ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయని వెళ్లడైంది. ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. భారతీయుల్లో మందు సుక్క పడగానే ఇంగ్లీష్ తన్నుకొస్తుందట.
శృతిహాసన్ మరో సంచలన నిర్ణయం !
బాబోయ్ మాకొద్దీ వర్క్ ఫ్రమ్ హోం..