బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా నిత్యం హెచ్చుతగ్గులకు గురవుతూనే ఉన్నాయి. ఒక రోజు భారీగా పెరిగితో మరో రోజు తగ్గుముఖం పట్టిన ధోరణి ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. తాజాగా మళ్లీ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం దేశంలోకి వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి…
దేశరాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,390గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,390 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఢిల్లీలో కిలో వెండి రూ.67,500గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,290గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.44,290 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో వెండి ధరలు కిలో రూ. 67,500గా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదివరకటితో పోలిస్తే.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,240గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,080 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ. 71,800గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 42,240గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,080గా ఉంది. కిలో వెండి ధర రూ. 71,800 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,240 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.46,080 వద్ద కొనసాగుతోంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్రయివేటుకు ఇసుక తవ్వకాలు
వామ్మో ఎక్కువ నిద్రపోతే అంతేనట !
మందుకొడితే.. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతారో తెలుసా ?