శరీర అలసటను తీర్చడానికి నిద్ర ఎంతో అవసరం. ఈ నిద్ర లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్న వారున్నారు. అయితే ఈ నిద్ర ఎంత అవసరమో.. అతి నిద్ర కూడా అంతకంటే అనర్థాలను తెస్తుంది. కొందరు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిద్రిస్తుంటారు.సాధారణంగా అయితే ప్రతి రోజూ 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోతే చాలని వైధ్యులు సూచిస్తుంటారు.
ఇలా టైం ప్రకారం పడుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే మనలో చాలా మంది వైధ్యులు సూచించిన టైం కంటే అధికంగా నిద్రపోతుంటారు. ఇలాంటి వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అతి నిద్రతో శరీర బరువు అమాంతం పెరిగిపోతుంది.
అలాగే వెన్ను నొప్పి, తలనొప్పి, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే డయాబెటీస్, అలసట కూడా కలగవచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అలాగే తొందరగా ముసలివాళ్లయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. అంతేకాకుండా అతినిద్ర తో తొందరగా చనిపోతారని అధ్యయానాలు వెళ్లడిస్తున్నాయి.
మందుకొడితే.. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతారో తెలుసా ?
శృతిహాసన్ మరో సంచలన నిర్ణయం !
బాబోయ్ మాకొద్దీ వర్క్ ఫ్రమ్ హోం..