సినిమా రంగమంటేనే రంగుల ప్రపంచం. ఇందులో రాణించాలంటే చాలా కష్టపడాల్సిందే. మరీ ముఖ్యంగా ఎలాంటి కుంటుంబ నేపథ్యంలో లేకుండా నిలదొక్కుకోవడం మాములు విషయం కాదు. కానీ ఇదివరకు పలువురు నటులు ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండానే అగ్ర కథానాయకులుగా వెలుగొందారు. దానికి మేగాస్టార్ చిరంజీవే ఉదాహరణ.
ఈ మధ్య కాలంలోనూ చాలా మంది ఎలాంటి సినీ కుంటుంబ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సంపూర్ణేశ్ బాబు కూడా ఒకరు. వెండితెరపై నవ్వులు పూయించే ఈ నటుడు చివరిసారిగా కొబ్బరిమట్ట రేంజిలో మరో సినిమా చేయలేదు. కథానాయకుడిగా కాకుండా పలు సినిమాల్లో ఇతర పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులను అలరించాడు.
మళ్లీ సంపూర్ణేశ్ బాబు పుడింగి నెంబర్ వన్ అంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి ఏకంగా ఇద్దరు భామలతో రోమాన్స్ చేయబోతున్నాడు. సంపూర్ణేశ్ బాబు హీరోగా మీరావలి అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. విద్యుల్లేఖ రామన్, సాఫీకౌర్లు కథానాయికలుగా నటిస్తున్నారు.
జిందగీ కొత్తగా నవ్వుతోందంటున్న’ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’
తెలుగువారు గర్వించదగ్గ మూవీ ఇది: మెగాస్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ ట్రెండ్ సెట్టర్ !