మధ్య మాల్దీవులు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అయిపోయింది. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు మాల్దీవుల్లో హాలిడేకు వెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దేశంలో ఓ వైపు కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే.. ఛస్తుంటే కొంత మంది మాత్రం మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఓవైపు కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంటే.. మీరు మాత్రం మాల్దీవులకు వెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారా. కాస్తయినా సిగ్గుండాలి అంటూ చాలా ఘాటుగా స్పందించాడు.
ఈ మధ్య జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిషా పటానీ, రణ్బీర్ కపూర్, ఆలియా భట్ మాల్దీవ్స్కు వెళ్లారు. ఈ సమయంలో వీళ్లు ఇలా చెక్కర్లు కొడుతూ.. మళ్లీ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ బాలీవుడ్ తారలపై ఫైర్ అయ్యారు. దేశంలో చాలా మందికి కనీసం తినడానికి తిండి కూడా లేదు.
ఇలాంటి సమయంలో మీరు డబ్బులు వృథా చేస్తారా? కాస్తయినా సిగ్గుండాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ మొదలు పెట్టడంతో వలస కూలీలు మళ్లీ కష్టాలు పడుతున్నారు. . ప్రతి ఒక్కరూ మాల్దీవ్స్ అనడం ఫ్యాషనైపోయింది. అక్కడి టూరిజం ఇండస్ట్రీతో వీళ్లు ఏం డీల్ కుదర్చుకున్నారో తెలియదు. మీ వెకేషన్లు మీ వరకే ఉంచుకోండి. ప్రపంచం మొత్తం బాధలో ఉన్నారు. నా వరకు నేను నా ఇంట్లోనే ఉంటాను. అదే నాకు మాల్దీవ్స్ అని నవాజ్ అన్నాడు.
తెలంగాణలోని అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ