పరిచయం చేసుకోవడం.. లవ్ చేసుకోవడం.. కొంత కాలం గడిపి.. ఆ తర్వాత విడిపోవడం సినిమావాళ్లకు కొత్తేమీకాదు. ఇండస్ట్రీ మొదలు అయ్యినప్పటి నుంచి ఇవి ఉన్నాయి. అయితే రీసెంట్ గా టాలీవుడ్లో ఓ హీరో, హీరోయిన్ కొద్ది రోజుల పాటు బాగా ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత వారు మధ్య ఏవో విభేదాలు రావడంతో.. ఆ హీరో తనను నమ్మించి మోసం చేశాడంటూ ఆ హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టాలీవుడ్లో తనతో పాటు ఓ సినిమాలో నటించిన సహనటుడిపై ఓ యువ నటి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తనను నమ్మించి మోసం చేశాడంటూ ఆరోపించింది. ‘పక్కా ప్లాన్’ అనే హర్రర్ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో సహజీవనం చేస్తున్నారు. ఈ నెపథ్యంలో పెళ్లి చేసుకోవాలని ఆమె అడగటంతో.. అతడు తప్పించుకుని తిరుగుతుండడంతో ఆమె జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆ నటుడిని అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాకు చెందిన నరేష్యాదవ్(28) ‘పక్కా ప్లాన్’ చిత్రంలో సెకండ్ హీరోగా చేయగా.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగరాణి(29) సెకెండ్ హీరోయిన్గా చేసింది.
నాగరాణి గతంలో ఒకరిని పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వగా ఆమెకు ఆరు నెలల పాప కూడా ఉంది. ఇక పక్కా ప్లాన్ మూవీ చేసే టైంలో వారి మధ్య పరిచయం కాస్త లవ్ గా మారటంతో.. వీరు సహజీవనం చేస్తున్నారు. అయితే పెళ్లికి నరేష్ ఒప్పుకోకపోవడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.
Related