Tuesday, April 30, 2024
- Advertisement -

కియారా అద్వానీపై టాలీవుడ్ హీరోల ఫోకస్..?

- Advertisement -

హాట్ బ్యూటీ కియారా అద్వానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ “భరత్ అనే నేను” సినిమాతో ఎంట్రీ ఇచ్చి అద్భుత విజయాన్ని అందుకుంది. తరువాత బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన “వినయ విధేయ రామ” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కియారా అద్వానీ “ఫ‌గ్లీ “చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్లో హీరోయిన్ గా నటించిన” షెర్షా” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వరుణ్ ధావన్,అనిల్ కపూర్, నీతు కపూర్ లతో “జగ్ జగ్ జీయో” మూవీలోనూ “భూల్ భులయ్యా 2”, “మిస్టర్ లేలే” వంటి చిత్రాల్లో నటిస్తోంది. కియారా అద్వానీ బాలీవుడ్ లో పలు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలతో కొల్లగొడుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా కోసం హాట్ బ్యూటీ కియారా అద్వాని నీ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Also read:త్వరలోనే శివతో సూర్య సినిమా.. ఎప్పుడొస్తుందంటే?

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి మెగా హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అలాగే అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తున్న “ఐకాన్”సినిమాలో కూడా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందట.ఇలా బాలీవుడ్ ,టాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వస్తుండటంతో కియారా డేట్స్ అందుబాటులో ఉంటేనే ఈ సినిమాను ఒప్పుకుంటోందట. ప్రస్తుతం కియారా అద్వానీ పలు సినిమాలలో బిజీగా ఉండడంతో చాలా సినిమాలను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Also read:టీచర్ జాబ్ సంపాదించిన మలయాళ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -