ప్రజలకు ఏ అత్యవసరం వచ్చినా ఒకే నంబర్కు కాల్ చేసే వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్ శాఖకు కాల్చేయాలంటే 100, అగ్నిమాపక సిబ్బందికి 101, అంబులెన్స్కు 108కి కాల్చేస్తున్నాం. అయితే ఏ అత్యవసరం వచ్చినా 112 అనే నంబర్కు ఫోన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీనిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.
తెలంగాణ పోలీస్శాఖ సైతం దీనిపై దృష్టి సారించింది. అతి త్వరలో ఈ నంబర్ను పూర్తిస్తాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ విధానం దాదాపు అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలోనూ ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖలను ఈ నంబర్కు అనుసంధానించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఇందుకు సంబంధించి అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. వందల మంది ఒకేసారి ఫోన్చేసినా.. వారి కాల్స్ స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 112 నంబర్పై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఏ ఆపద వచ్చినా ఒకే నంబర్కు ఫోన్ చేసే అవకాశం అక్కడ ఉంది. దీంతో మనదేశంలో కూడా అన్ని ఎమర్జెన్సీలకు ఒకే నంబర్ను అందుబాటులోకి ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Also Read
చిరు చేసిన తప్పే బన్నీ చేస్తున్నాడా..!