మంచి కథలకు ఎంచుకుని సినిమాలు చేస్తారు హీరో నాని. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న నాని వరుసగా సినమాలు చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘అంటే సుందరాని కి ’ షూటింగ్ ఇటీవల పూర్తయింది.
తర్వాత ‘దసరా’ చిత్రానికి నాని ఓకే చెప్పారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈసినిమాలో పల్లె వాతావరణాన్ని తలపించేలా రూ.12 కోట్లతో పల్లె సెట్ వేస్తున్నారట. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఐదెకరాల్లో అద్భుతంగా సెట్ ను వేసిన అవినాశ్ కొల్ల ఈ పల్లె సెట్ ను తీర్చిదిద్దుతున్నారు.
ఇందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాతంలోని 12 ఎకరాల స్థలాన్ని ఎంచుకున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: యాంకర్ అనసూయ క్షమాపణలు