- Advertisement -
హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పండంటి బిడ్డకు తల్లికాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా కాజల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఎరుపు రంగు చీరలో కాజల్ తళుక్కుమంది. ‘‘ఓ ఫొటోలో ‘మమ్మీ కమింగ్ సూన్ మే, 2022’ అని రాసుంది. అంటే కాజల్ డెలివరీ మే నెలలో అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కాజల్ నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది.