ఐపీఎల్ -12 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు తరుపున ఆడుతున్న సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ రబాడా దూరమయ్యారు.స్వల్ప గాయం కారణంగా బుధవారం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అతడు ఆడలేదు. త్వరలో ప్రారంభంకానున్న వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఐపీఎల్ నుంచి వెంటనే వచ్చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కబురు పంపింది. దీంతో రబడా స్వదేశానికి వెల్లేందుకు సిద్దమయ్యారు.రబడ లేకపోవడంతో చెన్నైతో జరిగిన మ్యాచ్లో డీసీ 80 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ప్రస్తుత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్లో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్లు ఆడి 25 వికెట్లు దక్కించుకున్నాడు. కీలక దశలో రబడ దూరం అవడం ఆజట్టుకు కోలుకోలేని దెబ్బే.వన్డే ప్రపంచకప్ ఎంతో దూరంలో లేనందున స్వదేశానికి వెళ్లాల్సివస్తోందన్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ తరపున ఆడటం మర్చిపోలేని అనుభూతిని కలిగించిందన్నాడు. తమ టీమ్ ఐపీఎల్ విజేతగా నిలవాలని ఆకాంక్షించాడు.
- Advertisement -
ఢిల్లీ క్యాపిటల్కు గట్టి ఎదురు దెబ్బ….
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -