పూరీ జగన్నాథ్ లాంటి సూపర్ డైరెక్టర్ తెలుగులో ఎవ్వరూ లేరు. కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో హీరో క్యారెక్టర్ నీ యాటిట్యూడ్ ని చూపించడం లో పూరి కి పూరీ నే సాటి అని చెప్పాలి. పూరీ జగన్నాథ్ కెరీర్ లో ఇప్పటి వరకూ చాలా రకాలైన స్టైల్స్ లో ఆయన లోని టాలెంట్ ని బయట పెట్టారు.
మహేష్ బాబు కోసం బిజినెస్ మ్యాన్ సినిమాలో పాట పాడిన పూరీ జగన్నాథ్ చాలా సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా చేసారు ఇప్పుడు ఆయన లిరిక్ రైటర్ గా ఒక సినిమా చేస్తూ ఉండడం విశేషం. అయితే ఈ విషయం పక్కన పెడితే త్వరలో తన సినిమా ఇజం పూర్తి అవ్వబోతోంది ఇప్పుడు పూరీ డిఫరెంట్ గా ఒక కొత్త కథ తో మల్టీ స్టారర్ సినిమా చేస్తా అంటున్నారు.
మహేష్ బాబు తో జనగణమన మొదలు అయ్యే లోగా ఈ చిన్న ప్రాజెక్ట్ చేస్తారట. ఓ ఇద్దరు కుర్ర హీరోలతో పూరి జగన్ మల్టీ స్టారర్ సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుర్ర హీరో నాగ శౌర్యను ఒక హీరోగా ఎంచుకున్న పూరి.. పెళ్లి చూపులతో సోలో సక్సెస్ కొట్టిన విజయ్ దేవరకొండను మరొక హీరో పాత్రలోకి దించాలని చూస్తున్నట్లు టాక్. అంతే కాదు ఇదొక యాక్షన్ లవ్ డ్రామా అని తెలుస్తోంది. ఒకే అమ్మాయి కోసం ఇద్దరి మధ్యన జరిగే సమరం అనమాట. అయితే హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ప్రస్తుతం హీరోయిన్ను ఫిక్స్ చేసే పనిలో ఛార్మి ఉన్నట్లు టాక్.
Related