Friday, May 3, 2024
- Advertisement -

పెళ్లిచూపులు త‌ర్వాత పెళ్ల‌యిపోయింది…

- Advertisement -

ఘ‌నంగా ప్రియ‌ద‌ర్శి పెళ్లి, వివాహ విందు

నా సావు నేను చ‌స్తా నీకెందుకు అనే డైలాగ్‌తో టాలీవుడ్ సెన్సేష‌న్‌గా మారిన న‌టుడు ప్రియ‌ద‌ర్శి. త‌న‌ డెలివరీ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న ప్రియదర్శి పెళ్లిచూపులు త‌ర్వాత పెళ్లి చేసేసుకున్నాడు. ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన హైద‌రాబాద్‌లో త‌న ప్రేయ‌సి ప్రియదర్శి వివాహం రిచా వ‌ర్మ‌తో పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. అయితే శ్రీదేవి మృతి వార్త‌ల‌తో ప్రియ‌ద‌ర్శి పెళ్లి అంత‌గా ఎవ‌రికీ తెలియ‌లేదు. పెళ్ల‌యిన త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా వివాహ విందు జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ ప్రముఖులు బారులు తీరారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రిచావర్మ ప‌క్క‌న ప్రియ‌ద‌ర్శి నిల‌బ‌డి అతిథుల‌ను అంద‌ర్నీ స్వాగ‌తం ప‌లికి కౌగిలించుకున్నాడు. ప్రియదర్శిని పెళ్లిచూపులు టీం ప్ర‌త్యేకంగా విష్ చేసింది. ఇటీవలే అ! సినిమాలో వంటరాని చెఫ్‌గా అసలు పాత్రలే లేని చెట్టు చేపను ఊహించుకుంటూ ప్రియదర్శి నటన అద్భుతంగా ఉంది. ఇప్పుడు మ‌రికొన్ని సినిమాలు చేస్తున్నాడు. చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న ప్రియదర్శి పెళ్లి కోసం కొన్ని రోజులు సినిమాల‌కు సెల‌వు పెట్టాడు. విభిన్న పాత్ర‌ల‌తో ప్రియ‌ద‌ర్శి అల‌రిస్తుండ‌గా అతడి వైవాహిక జీవితం ఆనందంగా ఉండాల‌ని కోరుకుందాం. దీనికి ఆద్య మీడియా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెబుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -