Monday, May 20, 2024
- Advertisement -

చావు బతుకుల్లో సీరియల్ నటి.. ఏకంగా అన్నిసార్లు సర్జరీ?

- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.సినీ ఇండస్ట్రీలోనూ చాలా మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ కరోనా కాటుకు గురయ్యారు. తాజాగా ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి, మూవీ ఆర్టిస్ట్ శరణ్య శశికి కరోన సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోందని ఆమె సన్నిహితులు తెలియజేశారు.

ప్రముఖ సీరియల్ నటి శరణ్య శశి కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ నటనకు దూరంగా ఉంటున్నారు.ఆమె ఇప్పటికే కీమోథెరపీ, కొన్ని రకాల సర్జరీలు చేయించుకొని కొంతవరకు ఆరోగ్యంగా మారడంతో కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు సంతోషించారు. తాజాగా మరోసారి పదకొండవ సర్జరీ జరగాల్సి ఉండగా ప్రస్తుతం కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారట.దీంతో ఆమె అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Also read:బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

శరణ్య శశి మొదట బాలచంద్ర మీనన్ సీరియల్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సూర్యోదయం సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సీరియల్స్ లో నటిస్తూనే చోటా ముంబై, థలప్పవు, బాంబే మార్చి 12, చాకో రాండమన్ వంటి సినిమాల్లో నటించింది. ఆమె ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగి రావాలని ఆమె అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.

Also read:మరోసారి రామ్ చరణ్ తో జతకట్టనున్న బాలీవుడ్ భామ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -