- Advertisement -
ఈమధ్య తెలుగు సినిమాలు నిడివి పేరుగుతుంది. అయిన దీనిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకొవడం లేదు. అర్జున్ రెడ్డి సినిమా 3గంటల నిడివితో వచ్చంది. సినిమాలో దమ్ము ఉంటే రన్ టైం ఎక్కువ అయిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకొరని అర్జున్ రెడ్డి నిరుపించింది. రాంచరణ్ రంగస్థలం, మహేష్ బాబు భరత్ అను నేను సినిమాలు కూడా దాదాపు మూడు గంటల రన్ టైం ఉన్నవే.
ఇప్పడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా 2 గంటల 47 నిమిషాల నిడివితో రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుంది. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 4న రిలీజ్కు రెడీ అవుతుంది.