- Advertisement -
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. అమితాబ్ వియ్యంకుడు ఎస్కార్ట్స్ గ్రూప్ అధినేత రాజన్ నందా నిన్న రాత్రి మరణించారు. అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ మావయ్య రాజన్ నందా.రాజన్ నందా కుమారుడు నిఖిల్ నందాను శ్వేతా వివాహం చేసుకున్నారు.గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తుంది.
ఆయన చనిపోయే సమయానికి అమితాబ్ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కోసం బల్గేరియాలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇండియాకు బయలుదేరి వచ్చారు. రాజన్ నందా స్వర్గస్తులైన విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.