తెలుగు సినీ పరిశ్రమ.. భారతదేశ సినీ పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలను దర్శకుడు రాజమౌళి బాహుబలిలతో తీశాడు. ఆ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఆడాయి. దేశవిదేశాల్లో ఆ సినిమా దాదాపు ఆరు నెలలు ట్రెండింగ్గా ఉన్నాయి. రష్యా, చైనా, జపాన్, అమెరికా, లండన్ తదితర దేశాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. అలాంటి బాహుబలి సినిమాకు మరో అరుదైన అవకాశం వచ్చింది.
పక్క దేశం పాకిస్థాన్ దేశం నుంచి బాహుబలి బృందానికి ఆహ్వానం అందింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలని బాహుబలి బృందానికి ఆహ్వానం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు. పాకిస్థాన్ రాజధాని కరాచీలో జరిగే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది ప్రముఖులు రాబోతున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగినా రాజమౌళి ఇప్పుడు పాకిస్థాన్ పిలవగానే చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌలి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.