ఎన్నో భారీ అంచనాల మధ్య బిగ్బాస్ తెలుగు రెండో సీజన్ గత జూన్ నెల 10న ఘనంగా ప్రారంభమైంది.17 మంది సభ్యులతో మొదలైన ఈ షో చివరికి ఆరుగురు మాత్రమే మిగిలారు.కౌశల్,తనీష్,రోల్ రైడా,సామ్రాట్,గీతా మాధురి,దీప్తి ఈ ఆరుగురు సభ్యులుగా బిగ్బాస్ హౌస్లో మిగిలారు.ఇక తాజాగా ఈ వారం ఇంటి సభ్యులందరు ఎలిమినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్బాస్.దీంతో ఇంటి సభ్యులందరు షాక్ గురైయ్యారు. టికెట్ ఫైనల్ టాస్క్ని ఇంటి సభ్యులు ఎవరు సరిగా ఆడకపోవడంతో ఈ వారం ఇంటి సభ్యులందరు ఎలిమినేషన్లో ఉన్నట్లు తెలిపాడు బిగ్బాస్ .దీంతో ఇంటి సభ్యులందరు కౌశల్ టార్గెట్ చేసుకుని మాట్లాడటం మొదలు పెట్టారు.కౌశల్ వల్లే ఇది అంత జరిగిందని ఇంటి సభ్యులు మాట్లాడారు.
రోల్, తనీష్, సామ్రాట్, దీప్తి, గీతా అందరూ కౌశల్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. బిగ్బాస్ రూల్స్ మీరు ఫాలో కాకపోతే కరెక్ట్ అని అదే మేము అతిక్రమిస్తే తప్పని కౌశల్ పై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. దీనికి కౌశల్ కూడా వారికి కౌంటర్ ఇచ్చాడు.నేను సంచాలికుడిగా తప్పు చేయలేదని,ఆ విషయం నాని గారు కూడా చెప్పారని తెలిపాడు కౌశల్.కౌశల్ కూడా కొన్ని పరిస్థితుల్లో నోరు జారడంతో ఆ విషయాలను హైలైట్ చేస్తూ హౌస్మెట్స్ మరింత రెచ్చిపోయారు. కౌశల్ పాత విషయాలను కూడా తవ్వి తీయడం మరిన్ని వివాదాలకు దారి తీసింది.ఈ వారం ఎలిమినేషన్లో అందరు ఉండటంతో కాస్తా అసహనానికి లోనైనా ఇంటి సభ్యులు కౌశల్ను టార్గెట్ చేసుకుని ఎపిసోడ్ని ఓ రచ్చబండ కార్యక్రమంలా తయారు చేశారు.మరి ఈ వారం బిగ్బాస్ ఇంటిని వదిలి ఎవరు బయటకు వస్తారో చూడాలి.