బిగ్బాస్లో నిన్న(బుధవారం) జరిగిన ఎపిసోడ్లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఈ వారం బిగ్బాస్లో ‘కాల్ సెంటర్’ టాస్క్ నడుస్తోంది. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ టాస్క్ ఎన్నో వివాదాలకు దారి తీసింది. కాల్ సెంటర్ ఉద్యోగులు, పబ్లిక్ కాలర్స్ ఇలా రెండు టీమ్ లుగా విడిపోయి హౌస్ మేట్స్ ఈ టాస్క్ని పూర్తి చేయాలి. ఈ క్రమంలో హోస్మెట్స్ అందరు కౌశల్ టార్గెట్ చేసుకుని మాట్లాడారు. కౌశల్ పై గీతామాధురి, దీప్తి సునైనాలు ఫైర్ అయ్యారు. కౌశల్ అయితే దీప్తి సునైనాను వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్స్ చేశారు.టాస్క్ రెండో రోజు కూడా గణేష్ కౌశల్పై పలు అనుచిత వాఖ్యలు చేశాడు.
ఇక ఈ రోజు జరగనున్న ఎపిసోడ్ ప్రొమోని విడుదల చేశారు బిగ్బాస్ టీం.కౌశల్, పూజా రామచంద్రన్, గీతా మాధురిల మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. కౌశల్ టాస్క్ లో తను చేసేది కరెక్ట్ అని సమర్ధించుకుంటూ రోల్ రైడాను తప్పుబట్టాడు.దీంతో అక్కడే ఉన్న గీతా మాధురి స్పందిస్తు… కౌశల్ ‘మీరు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే మరొకటి అన్నట్లుగా మాట్లాడుతున్నారు, మీద నాకు ఒపీనియన్ మారుతోంది’ అంటూ ఘాటుగా స్పందించింది. ఇక ఈ రోజు షో మరింత రసవత్తరంగా జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.