Wednesday, May 22, 2024
- Advertisement -

బిగ్‌బాస్ హౌస్‌ను ఊపేసిన కంటెస్టెంట్లు

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగింపు దశకు వచ్చింది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడనుంది. 16 మంది కంటెస్టెంట్లుతో ప్రారంభ‌మైన రెండో సీజ‌న్‌లో ఫైన‌ల్స్‌కు ఐదుగురు స‌భ్యులు చేరారు. తనీష్, కౌశల్, దీప్తి, గీతా మాధురి, సామ్రాట్‌లు ఫైనల్ పోరులో తలపడుతున్నారు. ఆల్ రెడీ ఎలిమినేట్ అయిన కంటెంస్టెంట్స్‌లో ఒక్క నూతన్ నాయుడు మిగిలిన అందరూ ఫ్యామిలీ పార్టీలో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేస్తున్నారు. శనివారం నాటి ఎపిసోడ్‌లో రెండో సీజ‌న్ కంటెంస్టెంట్స్ మొత్తం ఫ్యామిలీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు.

కేవలం ఐదు మంది ఫైనల్ కంటెస్టెంట్స్‌తో బోసిపోయిన బిగ్‌బాస్ హౌస్‌కి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ తిరిగి తీసుకురావ‌డంతో హౌస్ మొత్తం సందడిగా మారింది. 17 మంది కలిసి ఫుల్ జోష్‌లో పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ పార్టికి రోల్ రైడా, అమిత్‌లను హోస్ట్‌లుగా నియమిస్తూ,మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కలర్ ఫుల్ డ్రెస్‌లు అందించి పార్టీ వాతావరణం కనిపించే విధంగా హౌస్‌ను అలకరించారు. ఫ్యామిలీ పార్టీలో భాగంగా హోస్ట్‌లు రోల్ రైడా, అమిత్‌‌లు మిగిలిన కంటెస్టెంట్స్‌ను ర్యాపిక్ క్వచ్ఛన్స్ అడిగారు. సింగర్ గీతా మాధురి వరుస పాటలతో బిగ్ బాస్ హౌస్‌నూ ఊపేసింది. మిగిలిన ఇంటి స‌భ్యులంద‌రు ఎపిసోడ్ మొత్తం ఎంజాయ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -