Friday, April 26, 2024
- Advertisement -

ఆస‌క్తిని పెంచుతున్న ప‌వ‌న్ పీరియాడిక్ మూవీ !

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ వ‌ప‌న్ క‌ళ్యాణ్ ఆ మ‌ధ్య‌కాలంలో రాజ‌కీయా రంగ ప్ర‌వేశం చేసి.. సినిమాల‌కు దూర‌మ‌వుతున్న‌ట్టుగా క‌నిపించారు. కానీ ఆయ‌న వెండితెర రీఎంట్రీ అనంత‌రం త‌న‌కు తానే సాటి అనే రీతిలో వ‌రుస ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న రీఎంట్రీ మొద‌టి సినిమా వ‌కీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటోంది. ప‌వ‌న్ లాయ‌ర్‌గా క‌నిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఓ పీరియాడిక్ మూవీలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభం కాగా కొన్ని అనుకోని కార‌ణాల వల్ల తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. అయితే, ఈ సినిమాలో న‌టించే తారాగ‌ణం గురించి ప్ర‌స్తుతం ఓ ఆస‌క్తిర‌క‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదే ఈ చిత్రంలో బాలీవుడు న‌టులు న‌టిస్తుండ‌టం. ఇందులో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఒక రాణి పాత్రలో నటిస్తుండగా నిధి అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే, బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్‌పాల్ సైతం ఇందులో న‌టిస‌తున్నారు. అదికూడా మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. అయితే, ఈ విష‌యాన్ని చిత్ర యూటిన్ అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి నిర్మ‌త ఏఎం ర‌త్నం కాగా, ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మ‌త‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఇదివ‌ర‌కే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -