మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో ఆచార్య ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన కేజ్రీ అప్డేట్ వచ్చింది. ఆచార్య’ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ను మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ నెల 12న థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేస్తున్నారు. కొత్త పోస్టర్ విడుదల చేసి మరీ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఈ చిత్రంలోని చిరంజీవి, రామ్చరణ్ మధ్య సాగే కీలకమైన పాటను శ్రీరామనవమి నాడు విడుదల చేస్తారంటూ తొలత ప్రచారం జరిగింది. అయితే ఆ పాటను తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆచార్య మూవీ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా..చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో రామ్చరణ్ సిద్ధాగా కీలక పాత్రలో కనిపించనున్నాడు. చరణ్కు జంటగా పూజా హెగ్డే అలరించనుంది. మ్యాట్నీ ఎంట్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.