భారీ బడ్జెట్తో, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు భారీగా ప్రమోషన్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ‘దోస్తీ’ పేరిట ఓ పాట విడుదలైంది. అన్ని భాషల్లోనూ ఈ పాట రిలీజ్ కాగా.. తెలుగులో హేమచంద్ర ఆలపించారు. సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు. ఈ పాట విన్న ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నిమిషాల్లోనే లక్షల వ్యూస్ వచ్చేశాయి.
అయితే ప్రమోషనల్ సాంగే ఇలా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్నది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాల్పానిక చారిత్రక చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అల్లూరి సీతారామారాజుగా చరణ్.. కుమ్రం భీంగా తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్లు టీజర్లు అంచనాలను భారీగా పెంచాయి. ఇక మేకింగ్ వీడియో అయితే పిచ్చెక్కించింది.
ఇవాళ విడుదలైన ”దోస్తీ” పాట ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కీరవాణి స్వరపరిచిన మ్యూజిక్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ – అమిత్ త్రివేది – విజయ్ ఏసుదాసు – యాజిన్ నజీర్ వంటి ఐదుగురు ప్రముఖ సింగర్స్ ఈ సాంగ్ ను పాడారు.
Also Read
తగ్గేదెలా అంటున్న వెంకీ మామ..!