- Advertisement -
రంగస్థలం సినిమా తరువాత రాంచరణ్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్, నవీన్ చంద్ర లు నటిస్తున్నారు.
తాజాగా మరో విలక్షణ నటుడు ఈ సినిమాలో నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సాండల్వుడ్ స్టార్ సుధీప్.. చరణ్, బోయపాటి సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట.మరి విలన్గా వివేక్ ఒబెరాయ్ చేస్తున్న ఈ సినిమాలో సుధీప్ రోల్ ఏమిటో బయటకి చెప్పలేదు.ఈ సినిమాను దసరాకి తీసుకురావలని ప్రయత్నాలు చేస్తున్నారు.