Friday, May 17, 2024
- Advertisement -

త్రివిక్రమ్‌కి ఫస్ట్ స్ట్రోక్…… డెసిషన్ మార్పు తప్పదన్న ఎన్టీఆర్

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ తీరు అలానే ఉంటుంది మరి. కోట్లాది రూపాయలతో కూడిన వ్యాపారం. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలైతే ఎప్పుడో బడ్జెట్ పరిధులను దాటేశాయి. ప్రతి సినిమాకు కూడా ఇండస్ట్రీ హిట్ స్థాయి హిట్ కొడితే తప్ప కనీసం రికవర్ అవ్వలేని పరిస్థితి. ఇక త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ గురించి అయితే చెప్పనవరం లేదు. తాను ఖర్చు పెట్టించే విధానం భారీగా ఉంటుందని స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు కూడా. మరి ఆ స్థాయిలో ఖర్చు పెట్టించేవాడు….ఆ స్థాయిలోనే రచన కూడా చేయాలిగా? అదే స్థాయిలో సినిమా తెరకెక్కించాలిగా? ఇప్పటి వరకూ ఎలా ఉన్నా అజ్ఙాతవాసి సినిమాతో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు త్రివిక్రమ్. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా అజ్ఙాతవాసి పయనం సాగుతుంది.

అందుకే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎఫెక్ట్ కాస్తా ఇప్పుడు త్రివిక్రమ్ తర్వాత సినిమాపై పడింది. హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ వెంట పడే కాన్సప్ట్‌కి ఎప్పుడో తిలోదకాలు ఇఛ్చేశాడు ఎన్టీఆర్. సో…..ఇప్పుడు డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ని మార్చే ప్రయత్నం అయితే చేయడు. కానీ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను కూడా తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఎన్టీఆర్. అందులో భాగంగానే నాన్నకు ప్రేమతో సినిమా నుంచీ కూడా తనకు వరుసగా సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని త్రివిక్రమ్‌కి చెప్పాడు. అనిరుథ్ మ్యూజిక్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ….సినిమా బజ్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళేస్థాయి సాంగ్స్ అయితే మాత్రం దేవిశ్రీప్రసాద్ మాత్రమే ఇవ్వగలడని ఎన్టీఆర్ నమ్ముతున్నాడు. భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలంటే కచ్చితంగా గబ్బర్‌సింగ్, అత్తారింటికిదారేది రేంజ్ మ్యూజిక్ ఉండాల్సిందే. జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్‌లో కూడా దేవిశ్రీ మ్యూజిక్ పాత్ర చాలా ఉంది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీని తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాడు. అయితే దేవిశ్రీప్రసాద్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్ టైంలో పవన్‌కి గొడవైంది. అందుకే త్రివిక్రమ్ మాత్రం దేవిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అనిరుథ్ కొన్ని మాస్ బీట్స్ కంపోజ్ చేస్తాడని ……….అవి నచ్చకపోతే అప్పుడు చెప్పమని ఎన్టీఆర్‌కి చెప్పాడట. ఏది ఏమైనా ఇప్పటి వరకూ కూడా అన్ని విషయాలు తన కనుసన్నల్లో జరిగినట్టుగా ఇకపై త్రివిక్రమ్‌కి సాధ్యం కాకపోవచ్చు. అజ్ఙాతవాసితో పూర్తిగా డీలాపడిపోయిన త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ స్క్రిప్ట్‌ని కూడా పూర్తిగా రీ రైట్ చేస్తున్నాడు. అజ్ఙాతవాసితో పోయిన పేరును…..ఎన్టీఆర్ సినిమాను బ్లాక్ బస్టర్ చేసి మళ్ళీ తెచ్చుకుంటాడేమో చూడాలి మన త్రివిక్రముడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -