విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం గీత గోవిందం.ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే.14 కోట్ల బడ్టెట్తో తెరకెక్కిన ఈ సినిమా వందకోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఓవర్ సీస్లో రెండు మినియన్లు వసూళ్లు సాధించింది గీత గోవిందం.ఈ సినిమాకువిజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ఎంతటి పేరు వచ్చిందో సినిమా డైరక్టర్ పరశురామ్కు కూడా స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టింది ఈ సినిమా.
దీంతో పరుశురామ్ తెరకెక్కించబోయే తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరుశురామ్. గీత గోవిందం చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లోనే తన తదుపరి చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి హీరోని విజయ్ దేవరకొండని తీసుకుంటారో లేక హిరోతో లాంగించిస్తారో చూడాలి.