హీరో రాజశేఖర్ ఇటీవలే కరోనా బారిన పడి హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన గత కొన్ని రోజులుగా ఐసియూలో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం. రాజశేఖర్ ఆరోగ్యం మెల్లిగా కుదుట పడుతుందని డాక్టర్లు చెప్పారు.
ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రాజశేఖర్ మాత్రమే కరోనాతో పోరాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు.
అయితే ఈరోజు నటుడు రాజశేఖర్ కరోనా నుంచి కోలుకొని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా జీవిత రాజశేఖర్ మాట్లాడుతు ఆసుపత్రి యాజమాన్యంకు దన్యవాదాలు తెలిపారు.
40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!
పవన్ కళ్యాణ్ కెరీర్లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!