Friday, April 26, 2024
- Advertisement -

విభేదాల్లేవ్‌:అన్న కోసం త‌మ్ముడు వ‌స్తున్నాడుగా…!

- Advertisement -

గ‌త కొంత‌కాలంగా ఎన్టీఆర్‌కు క‌ల్యాణ్ రామ్‌కు మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ వార్త‌ల‌ను నిజం చేస్తు క‌ల్యాణ్ రామ్ న‌టించిన రెండు సినిమాల ఆడియో ఫంక్ష‌న్స్‌కు ఎన్టీఆర్ రాలేదు.అదే స‌మ‌యంలో వచ్చిన మ‌హేష్ భ‌ర‌త్ అను నేను, మ‌హ‌న‌టి సినిమాల‌కు ముఖ్యఅతిధిగా వెళ్లాడు ఎన్టీఆర్‌.దీంతో వీరి మ‌ధ్య విభేదాలు నిజ‌మే అని అనుకున్నారు.అయితే ఈ వార్త‌ల‌ను బ్రేక్ చేస్తు కల్యాణ్ రామ్ న‌టించిన నా నువ్వే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వెళ్తున్నారు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.నా నువ్వే సినిమాకు మొదట్లో మంచి బజ్ వచ్చింది. కానీ అనుకున్న టైంకు రిలీజ్ కాకపోవడంతో అది కాస్తా తగ్గిపోయింది. పటాస్ తరవాత కళ్యాణ్ రామ్ కు హిట్ అన్నదే లేకపోయింది. ఈ సినిమాతోనైనా హిట్ కొట్ట‌ల‌నే క‌సితో ఉన్నాడు కల్యాణ్ రామ్.ఈ సినిమాలో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -