Friday, March 29, 2024
- Advertisement -

బుల్లితెర‌పై ఎన్టీఆర్ సంద‌డి

- Advertisement -

వెండితెర‌పై వెనుతిరిగి చూడ‌కుండా దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ బుల్లితెర‌పై క‌నువిందు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అతి త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై త‌న విశ్వ‌రూపాన్ని చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. అది కూడా “ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు” అనే షో ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు.

అయితే, యంగ్ టైగ‌ర్‌కు బుల్లి తెర కార్య‌క్ర‌మాలు చేయ‌డం ఇదే మొద‌టి సారి కాదు. గ‌తంలో బిగ్‌బాస్ సీజ‌న్ 1 హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు. ఆ షో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. మ‌ళ్లీ ఇప్పుడు బుల్లితెర‌పై క‌నిపించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాడు. దీనికి సంబంధించి అన్న‌పూర్ణ 7 ఎక‌ర్స్ లో ప్రోమో షూటింగ్ జ‌రుగుతోంది. ఇదివ‌ర‌కు నాగార్జున ప్రోగ్రామ్‌నే కొద్దిగా మార్చి దీనిని తీసుకురాబోతున్నారు.

ఈ ప్రోగ్రామ్ ప్రోమోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ షూట్ చేస్తున్నాడు. నాలుగు రోజుల్లో ఈ షూట్‌ను పూర్తి చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఇందులో పాల్గొంటున్నారు. ఏప్రిల్ నుంచి బుల్లితెర‌పై ఈ షో ప్రారంభం కానుంది. మార్చి తొలివారంలో ఈ షోకు సంబంధించిన ఎంట్రీస్‌ను తీసుకోనున్నారు. కాగా, ఈ షో సంబంధించి ఎన్టీఆర్ భారీగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని టాక్‌. ఒక్కో ఎపిసోడ్‌కు కోటిపైనే తీసుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

పహిల్వాన్లతో ప‌వ‌ర్ స్టార్ ఫైట్ !

అల్లరి న‌రేష్ తో దిల్ రాజు సినిమా !

ప‌వ‌న్ సినిమాకు అలీ పెట్టుబ‌డి?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -