- Advertisement -
మెగా మల్టీ స్టారర్ ఆచార్య మూవీని తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారు దర్శకుడు కొరటాల శివ. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి మెగా అభిమానులకు డబుల్ ధమాకా అందించారు.
ఈ ఊపులో మరో మెగా హీరోతో పవర్ ఫుల్ మూవీకి ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం తాను కథ సిద్ధం చేశానని కొరటాల శివ వెల్లడించారు. తాను మొదటి నుంచి శ్రద్ధ పెట్టేది కథపైనేనన్నారు. ఆచార్య మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా తీయబోతున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు రాయని పరిధిలో ఆ కథ ఉండబోతోందన్నారు. పవన్ కల్యాణ్ తో సినిమా కోసం కథ సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభాస్ తో కూడా ఓ సినిమా ఉండబోతోందన్నారు.
సర్కారు వారి పాట సినిమా నుంచి మరో అప్ డేట్