నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన అక్కినేని హీరో నాగ చైతన్య తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.. రెండో సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పాడు.. ఆ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన నాగ చైతన్య కి ఏ సినిమా కూడా తన కెరీర్ పెద్దగా ఉపయోగపడలేదు.. ఒకానొక సమయంలో ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడని చైతు పై విమర్శలు కూడా వచ్చాయి.. అయితే 100% లవ్, మనం, ప్రేమం లాంటి సినిమాలు కెరీర్ లో సూపర్ హిట్ అయిన కూడా అవి వేరే వారి ఖాతాలోకి వెళ్ళిపోయాయి..
ప్రస్తుతం లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.. ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈ సినిమా కి దర్శకుడు కాగ ఫిదా తర్వాత చేస్తున్న శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమా పై చైతు కూడా మంచి నమ్మకం పెట్టుకున్నాడు.. అయితే ఈ సినిమా ఇంకా రాకపోవడం తో అక్కినేని అభిమానులు పెదవి విరుస్తున్నారు.. అందుకు కారణం లేకపోలేదట.. సినిమా కాస్త డౌట్ గా ఉండడంతో ఈ సినిమా కి రీ షూట్ ల మీద రీ షూట్ లు చెప్తున్నారట..
వాస్తవానికి శేఖర్ కమ్ముల సినిమా అంటే రీషూట్లకు సిద్ధ పడాల్సిందే. `లవ్ స్టోరీ` విషయంలోనూ ఇదే సీన్రిపీట్ అవుతోంది. ఇక లాక్ డౌన్ తరవాత షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పటికే మొత్తం పూర్తవ్వాల్సింది. కానీ శేఖర్ కమ్ముల చెక్కుడు కార్యక్రమం వల్ల నిరంతరాయంగా షూటింగ్ సాగుతూనే ఉంది. రషెష్ చూసుకున్న శేఖర్ కమ్ములకు కొన్ని ఇంప్రూవ్మెంట్లు అవసరం అనిపించాయని, వెంటనే రీషూట్లకు రంగం సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కేవలం రీషూట్లే జరగబోతున్నాయట. అటు చైతూ, ఇటు సాయి పల్లవి సైతం అందుకు మరిన్ని అదనపు డేట్లు ఇచ్చేశారని టాక్. మరి చైతు దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సునీల్..?
‘సర్కార్ వారి పాట’ యాక్షన్ ప్లాన్ చేంజ్.. ఎందుకు..?