సర్కారువారి పాట సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్తోపాటు సినీ అభిమానులంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్తో షూటింగ్ ఆగిపోయింది. అప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ లో ఉండగా షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తేవేయడంతో దుబాయ్ .. హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తిచేసుకున్నరు చిత్ర యునిట్.
సర్కారువారి పాట సినిమా షూటింగ్ రీసెంట్ గా ‘గోవా’ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ‘గోవా’లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయనీ .. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరక్ర్కిస్తిన్నారు. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాంకు దోపిడీలు, ఆర్థికవ్యవహారాలకు సంబంధించిన ఓ డిఫరెంట్ సబ్జెక్ట్తో ఓ మూవీ రాబోతున్నదట. త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఆ షెడ్యూల్ షూటింగు దాదాపు హైదరాబాద్ లోనే ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
Also Read: ఆచార్య విడుదలలో క్లారిటీ ఏదీ..!