Sunday, May 5, 2024
- Advertisement -

టీజ‌ర్‌తో షాకిచ్చిన కల్యాణ్ రామ్

- Advertisement -

ఇజం సినిమా త‌ర్వాత క‌ల్యాణ్‌రామ్ ఓ కొత్త సినిమాతో వ‌స్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌తో అంద‌రికీ షాకిచ్చాడు. జయేంద్ర దర్శకత్వంలో వ‌స్తున్న “నా నువ్వే” సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాతో క‌లిసి క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తున్నాడు. వీరిద్ద‌రి జోడి సినిమాకు ఫ్రెష్ లుక్ వ‌స్తోంది. పీసీ శ్రీరాం కెమెరా పనితనంతో సినిమాను ప్ర‌త్యేకంగా రూపొందించాడు. వేస‌విలో ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

‘లవ్‌..లవ్‌..లవ్‌..ఈ రోజంతా మనం దీని గురించే మాట్లాడుకుందాం’ అని త‌మ‌న్నా ఆర్‌జే పాత్ర‌లో మెరిసింది. ‘ప్రేమికా.. మనసుపై స్వారీ చేసెయ్‌’ అంటూ విషాద గీతంలో కల్యాణ్‌ రామ్ క‌నిపిస్తున్నాడు. కల్యాణ్‌ రామ్‌ వరుణ్‌ పాత్రలో, తమన్నామీరా అనే ఆర్జే పాత్రల్లో నటిస్తున్నారు. పీసీ శ్రీరామ్‌ ఈ సినిమాకు సినీమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

క‌ల్యాణ్‌రామ్ ఈ సినిమాతో పాటు కల్యాణ్‌రామ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ‘ఎంఎల్‌ఏ (మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయ్‌)’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంకా తమన్నా ‘క్వీన్‌’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన కంగనా రనౌత్‌ నటించిన ‘క్వీన్‌’కు రీమేక్‌గా వ‌స్తున్న క్వీన్‌లో న‌టిస్తోంది. ఇంకోటి విక్రమ్‌కి జోడీగా ‘స్కెచ్‌’ సినిమాలో త‌మ‌న్నా న‌టిస్తోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -