హర్రర్ నేపథ్యంలో వచ్చిన మళ్లీ అదే కోవలో నటించేందుకు నయనతార ఆసక్తి కనిపిస్తోంది. నయనతారకు ఈ జోనర్ బాగానే కలసిచ్చింది. మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అనుష్క తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు నయనతార ఉంది. ఆమె ప్రధాన పాత్రలో గతంలో బాలకృష్ణతో శ్రీరామారాజ్యం సినిమాలో సీత పాత్రలో నటించింది. హర్రర్ సినిమా ‘డోర’లో నటించి భయపెట్టేసింది… భయపడింది. ఆ తర్వాత ‘అరమ్’ చిత్రంతో నయన్ స్థాయి మరింత పెరిగింది. దీంతో మళ్లీ హర్రర్ కథలో నటించడానికి సిద్ధమవుతోంది. దర్శకత్వంలో తొలిసారి చేస్తున్న సార్జన్ ఓ సినిమా చేయనున్నాడు. ‘మా, లక్ష్మీ’ అనే షార్ట్ఫిల్మ్స్ చేయడంతో అందరీ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు అతడికి సినిమా అవకాశం వచ్చింది.
నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హెచ్చరికై ఇది మనిదర్గళ్ నడమాడుం ఇడం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కేజీఆర్ స్టూడియోస్ సంస్థ నిర్మాణంలో హర్రర్ సినిమా తీయనున్నారు. దీనికి సార్జాన్ దర్శకత్వంలో నయనతార నటించనుంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయన్ను వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది.