మెగా హీరో ఫ్యాన్స్కు నందమూరి ఫ్యాన్స్కు మధ్య ఎప్పటీ నుండో అధిపత్య పోరు నడుస్తుంది.ఇది గత 25 సంవత్సరాలు నుండి
ఇది ఆనవాయితీగా వస్తుంది.అటు చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఇండస్ట్రీలో మంచి పోటీ ఉన్నప్పటీకి చిరంజీవి అగ్ర కథనాయుకుడిగా ఉన్నాడు.చిరంజీవి తరువాత స్థానం బాలకృష్ణదే.ఆ తరం నుండి ఈ తరం వరకు ఇది కొనసాగుతుంది.కాని ఈతరం కథనాయుకులు మాత్రం సినిమా విషయాలలో పోటీ ఉన్న బయట మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు.ఎన్టీఆర్ – రాంచరణ్ ఇద్దరు నందమూరి – మెగా వారసత్వం తీసుకున్నవారే.
వీరిద్దరికి సినిమాలలో పోటీ ఉన్నప్పటీకి బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.ఒకరు సినిమా ఓపినింగ్కు మరోకరు వెళ్లుతు ఉంటారు. ఇప్పడు వీరిద్దరి కలిసి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా కూడా చేస్తున్నారు.ఆ సినిమా ఆగష్టులో ప్రారంభమవుతుందని సమాచారం.ప్రస్తుతం వీరిద్దరు వేరు వేరు సినిమాలతో బిజిబిజిగా ఉన్నారు.అనుకొకుండా వీరిద్దరు మంగళవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కలిశారు. అలా కలిసిన ఎన్టీఆర్ – రాంచరణ్ చాలా సేపు మాట్లాడుకున్నారు.దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది.
NTR & Ram Charan Recent Snap at Air port😍😍 pic.twitter.com/LKXjqZbJ3s
— Young Tiger NTR® (@dhfn9999oficial) March 7, 2018