Saturday, April 27, 2024
- Advertisement -

క్వారంటైన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న బుట్ట బొమ్మ..!

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా గత వారంలో నటి పూజా హెగ్డేకి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలోనే క్వారంటైన్ లోకి వెళ్లిపోయిన పూజాహెగ్డే తనను కలిసిన వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

పూజ క్వారంటైన్ లోనే ఉంటూ యోగాసనాలు గురించి చెబుతూ వీడియోను షేర్ చేశారు.కరోనా సమయంలో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటూ పూజా హెగ్డే ఈ వీడియో ద్వారా అందరికీ అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే పూజ తన క్వారంటైన్ టైంలో చిలిపి చేష్టలు చేస్తూ క్వారంటైన్ లైఫ్ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

Also read:ఆ దేశంలో పుట్టి తెలుగులో హిట్ కొట్టిన.. హీరో ఎవరో తెలుసా?

ఈ వీడియోలో పూజాహెగ్డే కన్ను కొట్టడానికి తెగ ప్రయత్నించారు. కనుబొమ్మలను పైకి, కిందకు కదుపుతూ తన చేష్టలతో అందరినీ నవ్వించేశారు. ఇదే కాకుండా పుస్తకాలు కూడా చదువుతున్నా అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ బుట్ట బొమ్మ చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read:స్టాలిన్ రేంజ్ లో అభిమానులను రిక్వెస్ట్ చేసిన చిరు.. ఎందుకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -