బాహుబలి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్టుగా ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో యువీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుజిత్ ‘రన్ రాజా రన్ ఫేం’ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాను దుబాయ్లో ఎక్కువ భాగం తీయాలని ప్లాన్ వేశారు. అయితే అక్కడ ఉన్న నిబంధనలతో సినిమా బృందం కష్టాలు తెచ్చుకుంది. దీంతో షూటింగ్కు అనుమతులు ఆలస్యమవుతున్నాయి.
భారీ యాక్షన్ సీన్స్ షూట్ కోసం ప్లాన్ చేస్తుండగా కొద్ది రోజులుగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. దీనికి అక్కడి నిబంధనలే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ షెడ్యూల్ను క్యాన్సల్ చేసేసి భారతదేశానికి వచ్చి ఇక్కడే అలాంటి సెట్టింగ్ వేస్కొని షూటింగ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. దుబాయ్లో అత్యంత భారీ వ్యయంతో సాహో యాక్షన్ సీన్స్ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ఫైట్స్తో పాటు చేజ్ సీన్స్ కూడా చిత్రీకరించాలని భావించగా అనుమతుల విషయంలో ఆలస్యం జరుగుతోంది.
దీంతో ఈషెడ్యూల్ను వాయిదా వేశారు. ఈ సమయంలో దుబాయ్ తరహా సెట్ను హైదరాబాద్కు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో వేసి షూటింగ్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే మళ్లీ అనుమతులు వచ్చాయని మార్చి మూడో వారం నుంచి దుబాయ్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ షెడ్యూల్లో దుబాయ్, అబుదాబి, రుమేనియాలో 60 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా నీల్ నితన్ ముఖేశ్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, మందిరా బేడి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2019 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ ఉంది.