- Advertisement -
తండ్రీకొడుకులు కలిసి చేసిన సినిమాల మే 11వ తేదీన థియేటర్లలోకి రానుంది. విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న సినిమా ‘మెహబూబా’. ఆకాశ్ పక్కన నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. భారత్- పాక్ సరిహద్దు నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా రూపొందించారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘మెహబూబా’ సినిమాను దిల్ రాజు తన బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ నిర్మించింది. సినిమాకు సందీప్ చౌతా సంగీతం అందించాడు. కొన్నాళ్ల కొందట ఈ సినిమా టీజర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. మరీ ఇప్పుడు సినిమాతో కుమారుడికి సూపర్హిట్ ఎంట్రీ ఇస్తున్నాడో లేదో చూడాలి.