Monday, May 6, 2024
- Advertisement -

వర్మ వార్నింగ్ తో ఏం చెబుతున్నాడో తెలుసా!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. ఆయన ఏ చిత్రం తీసినా ముందుగా దాన్ని ప్రత్యేకంగా కాంట్రవర్సీ అయ్యేలా చేసి తర్వాత రచ్చచేయడం కామన్ అయ్యింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రాలే అందుకు ఉదాహారణ. ప్రస్తుతం మర్డర్ చిత్రం రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇటీవల ఈ చిత్రంపై కోర్టులో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే ‘మర్డర్’ చిత్రానికి అడ్డంకి తొలగిపోయింది. కొన్ని షరతులతో చిత్రాన్ని విడుదల చేసుకోడానికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఇక ఏపి రాజకీయాల్లో కాంట్రవర్సీలకు ఎవరయ్యా అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు.

Raghurama Krishna Raju with Ram Gopal Verma

ఎన్నికల సమయంలో జగన్ అంటే ఎంతో ఇష్టమని గ్రేట్ లీడరని తెగ పొగిడేసిన ఈయన ఇప్పుడు ఆ పార్టీకే గుదిబండగా తయారయ్యారు రఘురామ కృష్ణరాజు. ప్రతి రోజు ఎదో ఒక కాంట్రవర్సీ సృష్టి వస్తున్నారు. మొదట్లో ఈ విషయాన్ని పార్టీ సీరియస్ గా తీసుకున్నా ఇప్పుడు చాలా సింపుల్ గా కొట్టి పడేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఈ ఇద్దరు కలిశారు.

ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు పలు ఎక్స్ ప్రెషన్లను తన ముఖంలో పలికించారు. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు వర్మతో కలిసి పోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ లో తాను కూడా రఘురామకృష్ణరాజు పొలిటికల్ గ్యాంగులో చేరుతున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి, రామ్ చరణ్, రామారావు (జూనియర్ ఎన్టీఆర్) లు కేవలం సినిమా వరకే పరిమితం అని, కానీ, ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణరాజేనని, ఆయన రియల్ హీరో అని పేర్కొన్నారు.

మరో సారి అదర కొట్టిన పెంచల్‌ దాస్‌..!

ముక్కు అవినాష్ కి ఆత్మహత్య ఆలోచన.. కారణం అదేనా?

కాజల్, గౌతమ్ ల ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

శృంగార అనుభవం గురించి మహేష్ హీరోయిన్ ఏందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -