Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం నేను ఎదురు చూస్తున్న‌ – రామ చ‌ర‌ణ్

- Advertisement -

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ సినిమాఈ సంక్రాంతి విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశంలో పాల్గోన్నాడు రామ్ చ‌ర‌ణ్. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు చ‌ర‌ణ్ ఒకేసారి నాలుగు సినిమాలు రావడం మంచిదేనా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పండక్కి ఎన్ని సినిమాలైనా రావచ్చు.. అన్ని విజయం సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు చ‌ర‌ణ్.

తన సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు రామ్ చరణ్. ఇక ఆ సినిమాల కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నారని చెప్పాడు ఈ హీరో. ఎన్టీఆర్ బయోపిక్.. వరుణ్ తేజ్ వెంకటేష్ ఎఫ్ 2.. రజినీ పేట సినిమాలు కూడా ఇదే పండక్కి వస్తున్నాయి. కచ్చితంగా ఇవ‌న్నీ విజయం సాధించాలని.. వేటికవే భిన్నంగా ఉన్నాయని కాబట్టి అభిమానులు అన్ని సినిమాలను ఆదరిస్తారని నమ్మకంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. గ‌త రెండేళ్ల నుంచి సంక్రాంతి సినిమాల‌ను గ‌మ‌నిస్తే , విడుద‌లైన ప్ర‌తి సినిమా విజ‌యాలు సాధించాయాని చెప్పుకొచ్చాడు. విన‌య విధేయ రామ‌లో హీరోయిన్‌గా కియారా అద్వానీ న‌టించింది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -