- Advertisement -
బాహుబలి తరువాత మాజీ హీరోయిన్ రమ్యకృష్ణకు క్రేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. ఈ సినిమా తరువాత పలు తెలుగు, తమిళ్ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారనే విషమం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణకి అవకాశం వచ్చినట్లు సమాచారం.
త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’లో నదియా .. ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అలాగే ఈ సినిమాలో కూడా రమ్యకృష్ణకు ఓ రోల్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఇటీవలే తమిళంలో సూర్య మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన రమ్యకృష్ణ, ప్రస్తుతం ‘శైలజా రెడ్డి అల్లుడు’లో పవర్ఫుల్ రోల్ చేస్తోంది.
https://www.youtube.com/watch?v=k9a9fSRhDoc&t=1s