లీడర్తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై దగ్గబాటి మనవడు బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాడు. ఆ సినిమా ప్రభావంతోపాటు తన విభిన్న నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. మంచి సినిమాలు విజయాలు అందుకుంటున్న నటుడు దగ్గుబాటి రానా. ఇప్పుడు తెలుగు,తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను పెంచుకుంటున్నాడు.
ఇప్పటికే 1945, హాథీమేరి సాథీ (తెలుగు, హిందీ) సినిమాల్లో నటిస్తున్నాడు. ఇదే సమయంలో ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించాడు. ఓ మలయాళ సినిమాలో రానా నటిస్తున్నారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ట్రావెన్ కోర్ రాజు మార్తండ వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజా మార్తండ వర్మగా రానా నటిస్తున్నాడు. 18వ శతాబ్దంలో జరిగిన కథతో భారీ చారిత్రక చిత్రంగా కె.మధు దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందుతోంది. మార్తండ వర్మ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ఈ ఏడాది ఆఖరులోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.
https://www.youtube.com/watch?v=tF97zo6rYBI