ప్రభాస్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 2019 ఆగస్టు 9న ప్రభాస్ నటించిన సాహో విడుదలైంది. అప్పటినుంచి ఇక ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉంటే 2022 సంవత్సరంలో ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. నిజానికి హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా ఎఫెక్ట్తో ఈ మూవీ విడుదల కాలేదు. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఇక ఇదే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 14న సలార్
విడుదల కాబోతున్నది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు కారణం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హీరోకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో ప్రశాంత్ నీల్ది అందెవేసిన చేయి. దీంతో ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక 2022 ఆగస్టు 11న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్
థియేటర్స్ లో సందడి చేయనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా .. సైఫ్ అలీఖాన్ రావాణాసురుడిగా కనిపిస్తున్నాడు. ఇలా 2022 సంవత్సరం ప్రభాస్ ఫ్యాన్స్కు పండగలా మారిపోబోతున్నది.
Also Read
ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!