అక్కినేని నాగచైతన్య ఇటీవలే శైలజా రెడ్డి అల్లుడితో హిట్ కొట్టాడు. ఈ సినిమా తరువాత చైతు నటించిన సవ్యసాచి సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రేమమ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పటికే యూఎస్,దుబాయ్లలో సినిమా విడుదల కావడంతో ,అక్కడ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టైల్ లో నడిచే సవ్యసాచి సెకండ్ హాఫ్ మాత్రం ఉహాలకందని విధంగా ఉంది. పది నిమిషాల్లో పద్మవ్యూహం అంటూ ఇంటర్వెల్ అనంతరం దర్శకుడు కథను మలిచిన తీరు ఆడియెన్స్ ని థ్రిల్లింగ్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా మాధవన్ – నాగ చైతన్యల మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అక్కడక్కడా కొద్దిగా స్లోగా అనిపించినా డైరెక్టర్ చందు ఓవరాల్ గా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను కామన్ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసే విధంగా ప్రజెంట్ చేశాడు.సినిమాలో సుభద్ర పరిణయం కాన్సెప్ట్ హైలెట్ అని చెప్పవచ్చు. ఇక ఫైట్స్ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. తన కంట్రోల్ లో లేని చేయితో కథానాయకుడికి ఎదురైన అనుభవాలు అతను వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశం క్లయిమాక్స్ వరకు ఉత్కంఠగా అనిపిస్తుంది.
డైరెక్టర్ చందు లవ్ సీన్స్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. కథకు తగ్గట్లుగా సాంగ్స్ ఫైట్స్ ని సెట్ చేసుకున్నాడు. ఇక సినిమాకు బలాన్ని ఇచ్చే అంశం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఎమ్ఎమ్.కీరవాణి మరోసారి తన విజన్ ని చూపించారు. మ్యూజిక్ తో సీన్స్ కి ఏ స్థాయిలో బలం చేకూరుతుందో ఈ సినిమా ఒక ఉదాహరణ.పాటలను కూడా చాలా బాగా తెరకెక్కించారు. చైతన్య డ్యాన్స్ కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాలో మరో హైలెట్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్ తో ఎంటర్టైన్ గా సాగే కథలో మాధవన్ ఎంట్రీ ఊహించని మలుపు. చైతూ – మాధవన్ ల మధ్య జరిగే మైండ్ గేమ్ సినిమాలో మరో హైలెట్ పాయింట్. ఫస్ట్ హాఫ్ లో సినిమా కొంచెం బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ఏ మాత్రం నిరాశపరచదనే టాక్ వైరల్ అవుతోంది. నిధి అగర్వాల్ – భూమికల నటన కూడా బావుంటుంది. ఇక ఈ దీపావళికి కథానాయికుడు నాగ చైతన్య మాంచి హిట్ అందుకుంటాడాని చెప్పవచ్చు.సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు చైతుకి మాస్ హిట్ వచ్చిందని తెలియజేయడం విశేషం.