వెంకటేశ్, ప్రియమణి జంటగా.. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప చిత్రం ఈ నెల 20 (మంగళవారం) అమెజాన్ ప్రైమ్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఓ అగ్రహీరో నటించిన చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుండటంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక వెంకటేశ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరోవైపు నిర్మాత సురేశ్ బాబు నిర్ణయం పట్ల థియేటర్ల యజమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వెంకటేశ్ తన అభిమానులకు సారీ కూడా చెప్పాడు.
కాగా తాజాగా ఈ విషయంపై సురేశ్ బాబు స్పందించారు. నారప్ప చిత్రం ఓటీటీలో విడుదల కావడం నాకు కూడా ఎంతో బాధగానే ఉంది. ఎందుకంటే నాకు కూడా థియేటర్లు ఉన్నాయి. థియేటర్ల యజమానులు ఎంత నష్టపోతారో తెలుసు. అయితే ఈ సినిమాలో నాతోపాటు మరో నిర్మాత కళైపులి ఎస్ థాను మెజార్టీ భాగస్వాముడిగా ఉన్నారు. ఆయన నిర్ణయం మేరకే సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇక దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదలయ్యే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. మలయాళంలో దృశ్యం2 కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
Also Read: అన్నా మీ నంబర్ ఇవ్వండి.. తేజ్ ఫన్నీ ఆన్సర్..!
ఇక విరాట పర్వం గురించి ఇప్పుడే ఏ విషయం చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. తెలంగాణలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యే చాన్స్ ఉంది’ అని సురేశ్ బాబు పేర్కొన్నాడు. మొత్తానికి నారప్ప ఓటీటీలో విడుదల చేయడం.. తీవ్ర వివాదాస్పదం అయింది. దీంతో సురేశ్ బాబు ఓ క్లారిటీ ఇచ్చేశాడు.
Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !