టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తాజాగా తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లుంది.తెలుగు చానెల్స్ శ్రీరెడ్దిని పట్టింకోకపోవడంతో ఆమె తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయినట్లుంది.అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన , వారందరికీ వ్యతిరేకంగా కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్నాను అని చెబుతూ సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేసే నటి శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.
తమిళ ఇండస్ట్రీకి చెందిన మురుగదాస్ నుండి మొదలుపెట్టి లారెన్స్, శ్రీకాంత్, సుందరి సి ఇలా కొందరు తమిళ సెలబ్రిటీలపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.చెన్నైకు వెళ్లి అక్కడ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది శ్రీరెడ్డి.ఆమె చేసిన ఆరోపణలపై హీరో కార్తీ స్పందించారు.శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.ఆమె ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి కానీ అది వదిలేసి ఇలా సోషల్ మీడియాలో అందరిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు అని శ్రీరెడ్డిని ప్రశ్నించారు.