- Advertisement -
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా వస్తున్న చిత్రం టిల్లు స్వ్కేర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకురానుండగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇక రిలీజ్కు ముందే సినిమా ఓటీటీ పార్ట్నర్ లాక్ అయింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం ఫ్యాన్సీ రేటును వెచ్చించిందని టాక్. మే తొలివారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది టిల్లు స్క్వేర్.
డీజే టిల్లు…యూత్ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్దు డైలాగ్ డెలివరీ, ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ టిల్లు స్వ్కేర్ని ప్రేక్షకుల ముందుకు వస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆ సీన్స్లో అనుపమ రెచ్చిపోయి నటించింది..