Friday, April 26, 2024
- Advertisement -

కరోనా తో ప్రముఖ నిర్మాత కన్నుమూత

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంత ఉధృతి కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ కుదేలైపోతుంది. ఎంతో మంది సినీ తారులు.. దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు కన్నుమూస్తున్నారు. గత నెలలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతో మంది చనిపోయారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నిర్మాత జె.కృష్ణస్వామి కరోనా మహమ్మారి బారిన పడి గురువారం చెన్నైలో కన్నుమూశారు.

వారం క్రితం క‌రోనా రావ‌డంతో స్థానిక క్రోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గురువారం రోజు అతని ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో క‌న్నుమూసారు. క‌స్ట‌మ్స్ శాఖ‌లో ఉద్యోగం చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత బుల్లితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు.

అభినయ క్రియేషన్స్‌ సంస్థ ద్వారా మాంభూమి కి మామియార్, మహారాణి సెంగమలం, గ్రీన్‌ సిగ్నల్, చెల్లమ్మ, దేవతై తదితర మెగా సీరియ ళ్లు నిర్మించారు. ఆయ‌న మృతికి ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

‘శ్రీకారం’ నిర్మాతలకు హీరో శర్వానంద్ లీగల్ నోటీసులు?

నేటి పంచాంగం, శనివారం (29-05-2021)

ఎన్టీఆర్‌కు భార‌త‌రత్న ఇస్తే తెలుగు జాతికి గౌరవం : చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -